నారా భువనేశ్వరి రూ.2కోట్ల విరాళం

 నారా భువనేశ్వరి రూ.2కోట్ల విరాళం

Nara Bhuvaneswari

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు.

ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాల వరద బాధితులకోసం రెండు కోట్ల రూపాయలను ప్రకటించిన తన సతీమణి నారా భువనేశ్వరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. సహాయం చేయడానికి ముందుకోచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *