అమ్రపాలి కీలక నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ అమ్రపాలి ఐఏఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని మహానగరంలో బాటసారులు,పిల్లలు,మహిళలపై వీధి కుక్కల దాడి సంఘటనలు పెరిగిపోతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.
అందులో భాగంగా నష్టనివారణ చర్యల్లో భాగంగా నగరంలో అన్ని పెంపుడు కుక్కల యజమానులు జీహెచ్ఎంసీ వద్ద నమోదు చేయాలని కమీషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ సదుపాయం మై జీహెచ్ఎంసీ(MY GHMC) మొబైల్ యాప్ లో ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
నగరంలో తాము పెంచుకునే కుక్కలకు సమయానికి టీకాలు వేయించాలి.. మూగ జీవుల సంరక్షణ చట్టాల గురించి యజమానుల ఫోన్ నంబర్లకు తగిన సమాచారం అందిస్తామని కమీషనర్ అమ్రపాలి కీలక ఆదేశాలను జారీ చేశారు.
