గాంధీకి రూ. 66కోట్లు

 గాంధీకి రూ. 66కోట్లు

హైదరాబాద్ మహానగరంలో ఉన్న గాంధీ ఆసుపత్రి అభివృద్ధి పనులు, కాలేజీ విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాలకు గాను రూ. 66 కోట్ల నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది..

ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు.

టీజీఎంఎస్ఐడీసీ  ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి హేమంత్ ను సూపర్డెంట్ రాజారావు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *