జేబీఎస్-కరీంనగర్ మధ్య 35 ఎలక్ట్రికల్ బస్సులు

 జేబీఎస్-కరీంనగర్ మధ్య 35 ఎలక్ట్రికల్ బస్సులు

Loading

కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఈరోజు ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్ గార్లు, కరీంనగర్ మేయర్ సునిల్ రావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఆదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులోనే కరీంనగర్-2 డిపోకు చేరుకొని అక్కడ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్ ను పరిశీలించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *