రేవంత్ రెడ్డి సీఎం కుర్చీకి ఎసరు …?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఇదే అఖరి అవకాశమా..?. వరుస వివాదాలతో.. ఒంటెద్దు పోకడలతో ఇటు పార్టీకి.. అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాతీయ నాయకత్వం భావిస్తుందా..?. మొదట్లో నష్టాన్ని పూడ్చుకోవడానికి నిజాయితీకి నిలువటద్దంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా పంపించారా..?. అంటే ప్రస్తుతం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను చూసి అవుననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.
2023డిసెంబర్ తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి మొదటి రోజు నుండే ఇటు కాంగ్రెస్ పార్టీ.. అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా తమ విధానాలను.. కార్యక్రమాలను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. లక్షల కోట్లను కేసీఆర్ కుటుంబం తమ జేబుల్లో వేసుకుంది. కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు అని తాను విమర్శలు చేయడమే కాకుండా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలతో అఖరికీ గల్లీలో ఉండే నేతలతో సైతం విమర్శలు చేయించారు. తెల్లారే మంత్రి కొండా సురేఖ సిద్ధిపేట జిల్లాకు వెళ్లి రంగనాయక్ సాగర్ నుండి నీళ్లను విడుదల చేయిస్తారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రం రాకముందు నల్గోండ జిల్లా అంటే ప్లోరైడ్ జిల్లా.. మహబూబ్ నగర్ జిల్లా వలసల జిల్లా.. కరీంనగర్ జిల్లా దుబాయి వలసల జిల్లా.. చేనేతన్నల ఆత్మహత్య జిల్లాగా పేరుగాంచింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊరికి అఖరికీ ఆదిలాబాద్ అడవుల్లో ఉండే తాండలకు సైతం నల్లా ద్వారా స్వచ్చమైన తాగునీళ్లను అందించిండు మాజీ సీఎం కేసీఆర్. ఈ పథకంతోనే ప్లోరైడ్ జిల్లాగా ఉన్న నల్గోండ ప్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని అక్కడి ప్రజలతో పాటు మేధావులు.. అఖరికి కేసీఆర్ శత్రువులు సైతం ఒప్పుకున్న నగ్నసత్యం. అలాంటిది మిషన్ భగీరథ వృధా పథకం.. దీనికింద వేల కోట్లను కేటీఆర్, కాంట్రాక్టర్లు తిన్నారు అని ఆరోపణలు చేశారు. అసలు మిషన్ భగీరథ పనులే జరగలేదు. ఆ పనుల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. మళ్లీ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీళ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తారు.
ఇలా కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలపైనే కాదు ఆసరా , కళ్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతు భీమా, దళితబంధు ఒక్కటేమిటి కేసీఆర్ ప్రభుత్వం గతంలో పదేండ్ల పాలనలో అమలు చేసిన నాలుగు వందల పథకాలపై ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు .. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ రోజు నిద్ర లేచిన దగ్గర నుండి ఒకటే విమర్శలు. మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు రెండు వేలు తీసుకుంటున్నారు. ,మేము అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తాము. ఇప్పుడు కళ్యాణ లక్షీ కింద లక్ష రూపాయలే. మేము వచ్చాక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము. ఇప్పుడు రైతుబంధు కింద పదివేలు మాత్రమే తీసుకుంటున్నారు. మేము అధికారంలోకి వచ్చాక పదిహేను వేలు ఇస్తాము. మహిళలకు రెండున్నర వేలు ఇస్తాము. ప్రతి ఆడబిడ్డకు స్కూటీలు ఇస్తాము . ఇలా నోటికి ఏది వస్తే అది హామీచ్చి పడేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఇస్తున్న అదే రెండు వేలు. రైతుబంధు కింద పదివేలు. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నారు తప్పా ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పైసా ఎక్కువగా ఇవ్వడం లేదు.
ఆ తర్వాత హైదరాబాద్ మహానగరంలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములతో పాటు చెరువులు , ఖాళీ స్థలాలను అక్రమించుకున్నారు. వాటన్నింటిని పరిరక్షించడమే లక్ష్యంగా హైడ్రా తీసుకువస్తున్నాము అంటూ కొన్ని రోజుల పాటు సెలబ్రేటీలైన తమకు గతంలో వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు సానుకూలంగా ఉన్న నాగార్జున లాంటి హేమాహేమీల ఆస్తులను ధ్వంసం చేశారు. అప్పుడు కోర్టు సైతం ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. అయిన తీరు మార్చుకోని రేవంత్ రెడ్డి సర్కారు పేదవాళ్ల ఇండ్లను కూల్చివేసి బజారున పడేసింది. హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఎన్నికల్లో అసలు ఓపెనింగ్ కొట్టలేదు. హైడ్రాతో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేసుకుంది. ఇలా హైడ్రాతోనే కాదు నిరుద్యోగ యువతతో పెట్టుకుంది. అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గప్పాలు కొట్టిన రేవంత్ రెడ్డి గతంలో నోటిఫికేషన్లు ఇచ్చి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే వాటి ఫలితాలను ఇప్పుడు విడుదల చేసి తామేదో నోటీఫికేషన్లు ఇచ్చి.. పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసినట్లు నియామక పత్రాలను వారికి అందజేసి నిరుద్యోగ యువతలో పరువు పొగొట్టుకుంది. ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటదని గల్లీ నుండి హైదరాబాద్ బస్తీ వరకూ అన్ని వర్గాలు అనుకులే సాగుతుంది రేవంత్ రెడ్డి పాలన.
ఈ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఢిల్లీకెళ్లి ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు మల్లిఖార్జున ఖర్గే లకు నివేదికలు ఇస్తూనే వస్తున్నారు. మంచి సమయం కోసం ఎదురుచూసిన రాహుల్ గాంధీ తనకు అత్యంత నమ్మకస్తురాలైన నిజాయితీకి నిలువటద్దమైన మీనాక్షి నటరాజన్ ను అప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షీ ను తప్పించి ఆమె స్థానంలో తెలంగాణకు పంపారు. మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే ముందు మీరంతా నాచుట్టూ కాదు అధికారం రావడానికి కష్టపడిన కార్యకర్తల చుట్టూ.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల చుట్టూ తిరగండి. వాళ్ల సమస్యలను తీర్చండి. నా సంచులు మోసినంత మాత్రాన. శాలువాలు కప్పితే మీకు పదవులు ప్రమోషన్లు రావు. వారికి సేవ చేస్తేనే వస్తాయని చెప్పి ఇక్కడ రాష్ట్ర జిల్లా మండల స్థాయి నేతలతో.. కార్యకర్తలతో భేటీ అవుతూ పార్టీ తాజా భవిష్యత్తు పరిణామాలపై నివేదికలు తీసుకున్నారు. ఆ నివేదికలను ఢిల్లీకి పంపారు. ఇక ఇప్పుడే ప్రారంభమైంది రేవంత్ రెడ్డి పవర్ కటింగ్స్ ..
ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలో రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన.. తన అనుచరులుగా ముద్రపడిన వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పేర్లను ఢిల్లీకెళ్లి మరి జాతీయ నాయకత్వానికి అందజేశారు. కానీ ఎవరూ ఊహించనివిధంగా. అప్పటివరకూ డార్క్ లో ఉన్న విజయశాంతి , అద్ధంకి దయాకర్ లాంటి వాళ్లకు అవకాశమిస్తూ రేవంత్ రెడ్డి మీ ప;ప్పులుడకవని తొలి సంకేతం పంపారు. అయిన గ్రహించని రేవంత్ రెడ్డి హాడావుడిగా హెచ్ సీయూ భూములను సీనియర్ మంత్రులైన భట్టీ విక్రమార్క , దుద్ధిళ్ల శ్రీధర్ బాబు లాంటి వాళ్ల అభిప్రాయాలను గౌరవించకుండా టీజీఐఐసీకి బదలాయించి పదివేల కోట్లను అప్పుగా తెచ్చారు. మొత్తం నలబై వేల కోట్ల రూపాయలను లక్ష్యంగా పెట్టుకుని మొదలెట్టిన ఈ కుట్రను యూనివర్సిటీ విద్యార్థుల పోరాటంతో సుప్రీంకోర్టు ఆ భూముల వేలం కానీ.. అక్కడ ఎలాంటికార్యక్రమాలను చేపట్టోద్దంటూ అప్పటివరకూ జరుగుతున్న విధ్వంసానికి బ్రేకులు వేసింది. ఇది రేవంత్ రెడ్డికి రెండో హెచ్చరిక అనడానికి అప్పటివరకూ ఢిల్లీలో ఉన్న మీనాక్షి నటరాజన్ ఉన్నఫలంగా హైదరాబాద్ రావడం. సీనియర్ మంత్రులైన భట్టీ విక్రమార్క, దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు. అప్పటివరకూ రేవంత్ రెడ్డి ఆయన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో భేటీ అయ్యారు.
ఆ తర్వాత యూనివర్సిటీ విద్యార్థులతో.. టీచర్స్ కమిటీతో.. ప్రజాసంఘాలతో ఇలా మేధావులతో.. సామాన్యులతో అందరితోనూ మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు జరిపారు. అక్కడ వాస్తవ పరిస్థితులపై అరా తీసి నిజనిజాలు తెలుస్కున్నారు. అప్పటికప్పుడు హైకమాండ్ కు పంపారు. దీంతో నిజనిజాలు తెలుస్కున్న జాతీయ నాయకత్వం రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరు వస్తుందనే రెండో సంకేతంగా ఏకంగా సీఎం పెట్టిన యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమ కేసులు కొట్టివేస్తూ.. సంగారెడ్డి జైల్లో ఉన్న ఇద్దరు విద్యార్థులను భేషరత్ గా విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు. ఇది మరవకముందే మళ్లీ రాత్రికి రాత్రి భట్టీ యూనివర్సిటీ వీసీకి యూనివర్సిటీలో ఉన్న పోలీసు బలగాలను వెనక్కి తీసుకుంటున్నాము. ఒకప్పటి పరిస్థుతులు ఉండేలా చూస్కోవాలని లేఖ రాశారు.
ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయాల్సిన.. తీసుకోవాల్సిన నిర్ణయాలను.. విధానాలను ఆయనతో సంబంధం లేకుండా ఓ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు తో చేయిస్తూ పార్టీ నియమాలు.. నిబంధనలు పట్టించుకోకుండా.. పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేకూర్చేవాళ్ళు ఎంతటి గోప్పోల్లైన .. నేతలైన పక్కకు పెట్టేస్తాము. మేము మెచ్చినట్లు కాదు ప్రజలు మెచ్చినట్లు పాలనను సాగించాలని హెచ్చరికలు జారీ చేయడం రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే సీఎం కుర్చికి ఎసరు రావడం ఖాయమనే సంకేతాన్ని నటరాజన్ ద్వారా రాహుల్ గాంధీ పంపినట్లు ఉందన్నారు రాజకీయ విశ్లేషకులు,.
