పథకాలకు పైసల్లేవు.. పబ్లిసిటీకి కోట్లు…!

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత పదిహేను నెలలుగా ప్రభుత్వ సొమ్మును… తెలంగాణ ప్రజల కష్టార్జీతాన్ని హారిత కర్పూరంలా ఖర్చు చేస్తుంది. ఇటీవల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై వార్శికోత్సవ సంబురాలంటూ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు.
ఇటు రాష్ట్రానికి కానీ అటు ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేని మిస్ వరల్డ్ పోటీలకు సుమారు యాబై నుండి అరవై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా అరకొర చేసిన రైతు రుణమాఫీ ప్రచారం కోసం హోర్డింగ్స్ ప్లేక్సీలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో వేల కోట్ల పెట్టుబడిలను తీసుకోచ్చారంటూ ప్రచార కార్యక్రమాలకు రూ. 20కోట్లు ఖర్చు చేశారు.
ఏఐ సమ్మిట్ పేరుతో మరో పదకొండు కోట్ల రూపాయలను వృధా ఖర్చు చేశారు. తాజాగా హైదరాబాద్ మహా నగరంలో భారత్ సమ్మిట్ 2025 పేరు మీద కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పైసా ఉండదు. రైతుభరోసా.. రైతు రుణమాఫీ కింద తెలంగాణ రైతులకు ఇవ్వడానికిపైసల్ లేవని చెప్తారు కానీ ఇలాంటి వృధా ఖర్చులకు మాత్రం పైసలు వస్తాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.
