సొంత కార్యకర్తకే టీడీపీ నేత బిగ్ షాక్ …!

ఏపీ అధికార టీడీపీకి చెందిన సొంత కార్యకర్తకి పంగనామం పెట్టారు అదే పార్టీకి చెందిన ఓ ఎన్నారై నేత. అసలు విషయానికి వస్తే చిలకలూరిపేట లో మురళిమోహాన్ చౌదరి అనే ఎన్నారై టీడీపీ కార్యకర్తకు చెందిన ఓ కాంప్లెక్స్ ను అదే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు కబ్జా చేశారు. దీంతో చేసేది ఏమి లేక సదరు కార్యకర్త మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు చెందిన ముఖ్య అనుచరుడు.. బినామీగా చెప్పుకున్న ఓ నేతను ఆశ్రయించాడు.
మంత్రి అనుచరుడు.. తమ పార్టీ అతనే కదా న్యాయం చేస్తాడని సెటిల్మెంట్ కోసం ఇరవై రెండు లక్షల రూపాయలను ముట్టజెప్పాడు. ఆ తర్వాత పత్తాలేకుండా పోయాడు సదరు వ్యక్తి. దీంతో చేసేది ఏమి లేక మంత్రి లోకేశ్ ను ఆశ్రయించాడు. న్యాయం చేస్తానని హామీచ్చాడు. కాలం గడుస్తున్న కొద్ది సమస్య జఠిలం అవ్వడం తప్పా పరిష్కారం కావడం లేదు.
దీంతో తాను మోస పోయానని గ్రహించిన మురళి మోహాన్ చౌదరి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడంతో.. నన్ను నారా లోకేష్ మోసం చేశాడు అంటూ బాధితుడు అవేదనను వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకి కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకొలేదు. తన కాంప్లెక్స్ లోకి కస్టమర్లను కూడా రాకుండా టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు.నన్ను నా 70 సంవత్సరాల తల్లి ఇబ్బందులకు గురి చేశారు.. అయినా నేను మీకు భయపడను న్యాయ పోరాటం చేస్తాను .. న్యాయం చేయాలని బాధితుడు మురళీ మోహన్ చౌదరి వేడుకుంటున్నాడు.
