ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More
Tags :singidi news
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More
స్మార్ట్ ఫోన్ వినియోగం ఈ రోజుల్లో మరి ఎక్కువైపోతుంది.. ఎక్కడకి ఎందుకు వెళ్తున్నామో కనీసం సోయి లేకుండా ఎక్కడ పడితే అక్కడ మొబైల్ ఫోన్ వాడుతున్నాము.. ఇక బాత్రూమ్ లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. టవల్ లేదా షాంపూ తీసుకెళ్లడం మరిచిపోతామేమో కానీ మొబైల్ తీసుకెళ్లడం మాత్రం అసలు మరిచిపోము. అయితే బాత్రూమ్ లోకి స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల రెండు నిమిషాల్లో కానీవ్వాల్సిన కాలకృత్యాలను నిమిషాల కొద్ది అక్కడే […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు డబ్బులు ముఖ్యం కాదు అని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గురించి అశ్విన్ మాట్లాడుతూ” తనకు తెల్సినంతవరకు రోహిత్ శర్మ తలనొప్పి తెచ్చుకోవాలని కోరుకోడని “చెప్పారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును వీడతారనే ప్రచారం అశ్విన్ స్పందించారు. భారతజట్టుకి కెప్టెన్ గా ఉన్నాను. ముంబై ఇండియన్స్ కు చాలా సార్లు కెప్టెన్ గా చేశాను.. ఇప్పుడు కెప్టెన్ కాకపోయిన ముంబై ఇండియన్స్ […]Read More
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. దాదాపు పదిరోజుల పాటు అక్కడ్నే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కారు దిగగానే ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆమె కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములు… అక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించాలనే లక్ష్యంతో ఏర్పడిన వ్యవస్థ “హైడ్రా”.. హైడ్రాకు కమీషనర్ గా ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను ప్రభుత్వం నియమించింది. గత కొన్ని రోజుల్లోనే 45ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకుంది.. కొన్ని వందల అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను కూల్చివేసింది.. దీంతో హైడ్రా పనితీరును మెచ్చి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విరాళం ప్రకటించారు. ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో హైడ్రా తన దూకుడుని మరింత పెంచింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన మాదాపూర్ లోని అమర్ కోఅపరేటివ్ సోసైటీలోని ఆయన ఇంటికి “హైడ్రా” నోటీసులు పంపింది. తిరుపతి కొన్న ఇల్లు FTL పరిధిలో ఉందని అధికారులు గుర్తించారు. దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ,డాక్టర్ కాలనీ,అమర్ సోసైటీ వాసులకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా ఉన్న అక్రమ […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ కావడం లేదు అని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు కేటీఆర్,తన్నీరు హారీష్ రావు పర్యటించాలి.. ప్రతి ఒక్క రైతును అడిగి రుణమాఫీ కానీ వివరాలను స్థానిక కలెక్టరేట్ లో అందజేయాలి.. రుణమాఫీ కానీ అర్హులైన రైతులుంటే వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో […]Read More
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.., అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ […]Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని దీంతో జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మహిళలు నిలదీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..Read More
