తెలంగాణ రాష్ట్ర సీఎం..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని సీఎం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక సీఎం సొంత జిల్లా వికారాబాద్లోనూ బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సత్తా చాటి గెలుపొందారు.Read More
Tags :anumula revanth reddy
తెలంగాణలో ఉన్న మొత్తం 17లోక్ సభ స్థానాలకు ఇటీవల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమైన ఎన్నికల ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్ పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్,ఆదిలాబాద్ నుండి బీజేపీ అభ్యర్థి నగేష్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుందిన్Read More
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక […]Read More
జూన్ 2 తెలంగాణ ప్రజలందరూ తమకు వలస పాలకుల చెర నుండి విమూక్తి కలిగిన రోజు అని భావిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణోళ్లందరూ ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్2 సందర్భంగా రాజధాని మహానగరంలో మెట్రో పిల్లర్లకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చింది.ఈ ప్రకటనను తెలియజేస్తూ హోర్డింగ్స్ కటౌట్లు నగరవ్యాప్తంగా వెలిశాయి. ఈ యాడ్ లో తెలంగాణ మ్యాప్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అమెరికాకు వెళ్లింది ఫోన్ ట్యాపింగ్ నిందితులను కలవడానికి..నా దగ్గర రుజువులున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ “మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి మతిభ్రమించింది. ఆయన డాక్టరుకు చూపించుకోవడం మంచిది.ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఒక ఉదాహరణ. నేను నా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళింది […]Read More
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గోన్న మాజీ సీఎం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ మూడు ఫీట్ల ఎత్తు లేనోడు కూడా బీఆర్ఎస్ ను అంతం చేస్తాము. .లేకుండా చేస్తామంటుండు. అలా అన్నవాళ్లే అడ్రస్ లేకుండా పోయారు అని అన్నారు. .ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ గురించే అన్నారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్కుమార్రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More
తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతాన్ని మార్చి కిరవాణి సంగీత నేపథ్యంలో ఈరోజు విడుదల చేసిన సంగతి తెల్సిందే. అదే విధంగా రాష్ట్ర చిహ్నాంలో కూడా మార్పులు చేయనున్నట్లు..అందులో కాకతీయ తోరణం..చార్మీనార్ ను తీసేయనున్నట్లు తెలుస్తుంది.దీనిపై మాడభూషి శ్రీధర్ అనే వ్యక్తి కాళోజీ బతికి ఉంటే దీన్ని ఒప్పుకునేవాడా.. అంటూ రాసిన ఓ కవిత వైరల్ అవుతుంది మీరు ఓ లుక్ వేయండి..? ‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టికుంటివిపదవి […]Read More
జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తి చేసుకుంటున్న సంగతి తెల్సిందే. పదేండ్లను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ దశాబ్ధి ముగింపు వేడుకల పేరిట ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులు,అమరవీరుల కుటుంబాలతో పాటు అన్ని వర్గాల నేతలను ఆహ్వానించింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీకి కూడా కాంగ్రెస్ సర్కారు అహ్వానం పంపారు అయితే తాజా సమాచారం మేరకు సోనియా గాంధీ తెలంగాణ […]Read More
తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది.. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.Read More