సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన తీరు మార్చుకోని రేవంత్ రెడ్డి..!

 సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన తీరు మార్చుకోని రేవంత్ రెడ్డి..!

Loading

సింగిడి న్యూస్ -హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూముల్లో ఎలాంటి పనులు చేయవద్దు. తదుపరి విచారణ వచ్చేవరకు మొక్కను కూడా కొట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఏకంగా సీఎస్ శాంతికుమారి ఓ ఐఏఎస్ .. మీకంటూ స్వంత అధికారాలు..స్వేచ్చ ఉన్నప్పుడు ఎలా ఇలా రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహారిస్తారంటూ హెచ్చరిస్తూ అవసరమైతే జైలుకి పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చింది.

దీంతో హెచ్ సీయూ వివాదంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ కమిటీ రేవంత్ రెడ్డి సర్కారు వేసింది. ఈ కమిటీలో మంత్రులు భట్టీ విక్రమార్క మల్లు,దుద్ధిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ,జేఏసీ,విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాలతో సమావేశమై ఈ అంశం గురించి చర్చించి వాళ్ల అభిప్రాయాలను తీసుకోనున్నది. అయితే ఈ వివాదం అసలు రాజుకుందే నాలుగువందల ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతం.. వన్య ప్రాణులు నాశనమవు తున్నాయని.

అలాంటిది సంబంధిత మంత్రి కొండా సురేఖ కానీ సంబంధితాధికారులు లేకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారని విశ్లేషకులు,ప్రజా సంఘాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన కానీ తీరు మార్చుకోకుండా చేసిన తప్పునే పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక తప్పును కవర్ చేస్కోవడానికి ఇంకో తప్పును చేస్తూ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇటు ప్రభుత్వానికి.. అటు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని నిఖార్సైన కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *