చెప్పులతో పవన్ కళ్యాణ్ ఛీప్ పబ్లిసిటీ…!

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ శ్రేణులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు అనే తాండలో పర్యటించారు.
తమ తాండకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూడటానికి ఓ ముసలవ్వతో పాటు ఆ తాండ ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ క్రమంలో వాళ్లందరి కాళ్లకు చెప్పులు లేకపోవడం గమనించిన డిప్యూటీ సీఎం ఆ తాండలో ఉన్నవారందరికీ చెప్పుల పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.
నిర్ణయించుకున్నదే తడవు అందరికీ సుమారు నాలుగోందల ముప్పైకి పైగా ఉన్న అందరికీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది చెప్పుల పంపిణీ చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు స్పందిస్తూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయకుండా చెప్పులను పంచి ఛీప్ పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
