మాటలే .. పాటించని పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం నేను దేశభక్తుడ్ని.. దేశం కోసం.. రాజ్యాంగం పరిరక్షణ కోసం.. సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తానని ఊకదంపుడు ప్రసంగాలు చేస్తారు. తీరా రియాల్టీకి వస్తే వాటిని పాటించనని నిరూపిస్తారంటున్నారు ప్రతిపక్ష వైసీపీ శ్రేణులు.. రాజకీయ విమర్శకులు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక లో గత ఎన్నికల్లో వైసీపీ ఇరవై ఏడు స్థానాల్లో.. టీడీపీ ఒక స్థానంలో గెలుపొందింది. కానీ జనసేన కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. కానీ ఆ పురపాలకను సొంతం చేసుకుంది. అది ఎలా అంటారా..?. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పురపాలక చైర్మన్ తో పాటు తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరారు. దీంతో గత నెల ఇరవై తారీఖున పార్టీ మారిన చైర్మన్ పై వైసీపీకి చెందిన పదిహేడు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు.
అయితే ఇచ్చిన నోటీసుల్లో ఇద్దరూ కౌన్సిలర్ల సంతకాలు వ్యత్యాసం ఉన్నట్లు ఆర్డీఓ గుర్తించారు. ఆలోపే మరో ముగ్గురు వైసీపీ కౌన్సిలర్లు జనసేనలో చేరారు. అయితే నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే పదిహేను మంది దాన్ని సమర్ధించాలి. కానీ వైసీపీ వైపు కేవలం పద్నాలుగు మందే ఉన్నారు. కౌన్సిల్ లో జనసేన తరపున ముందు చేసిన పది మందితో పాటు తాజాగా ముగ్గురు చేరికతో కూటమికి పద్నాలుగు మంది ఉన్నారు. కౌన్సిల్ లో మెజార్టీ సభ్యులుండటంతో అది జనసేన సొంతమైంది.
