రజతోత్సవ సభకు లక్షలాదిగా రావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో సత్తుపల్లి పట్టణం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి మున్సిపాలిటీ, మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పాల్గొన్నారు.ముందుగా ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, సమావేశానికి వచ్చిన నాయకులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.తదనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించాబోతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి తెలిపారు.
నేడు రాష్ట్ర ప్రభుత్వం పాలన ఎలా ఉందో ప్రజల్లో చర్చ నడుస్తుందని తెలిపారు..పార్టీ రజోతోత్సవం సందర్భంగా మున్సిపాలిటీలో ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజుల్లో అరచేతిలో బెల్లం పెట్టీ మోచేతిలు నాకించే విదంగా వారి పాలన ఉందని,ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం తప్ప కొనుగోళ్లు లేవని తెలిపారు..సింగరేణి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి ఖజానా లో వేసుకుని వాడుతున్నారని,మనం అధికారంలో ఉన్నప్పుడు మన నిధులు మన ప్రాంతానికే ఉపయోగించేవాళ్ళమని తెలిపారు.
గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని,మనం ఉన్నప్పుడు పచ్చగా కళకళలాడిన పల్లే ప్రకృతి వనం ఇప్పుడు ఎండిపోయాయి తెలిపారు.పల్లె ప్రకృతి వనాలు నరికేసిన పట్టించుకునే నాథుడు లేడని,HCU లో పర్యావరణం ప్రమాదం లో పడిందని తెలిపారు..కళ్యాణ లక్ష్మి పథకం కింద మనం చీరతో పాటు లక్ష చెక్కు ఇచ్చే వాళ్ళంమని,ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ లేదు,షాది ముబారక్ లేదని తెలిపారు..అధికారంలోకి రావడం కోసం దళితులకు,రైతులకు మాయమాటలు చెప్పిరని, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి మీద ప్రణాళిక లేదని,పారిశుధ్యం మీద శ్రద్ధ లేదని తెలిపారు..
కేసీఆర్ ఆనవాళ్లు చెరుపుదాం అనే ఆరాటమే తప్పితే అభివృద్ధి మీద దృష్టి లేదని,రైతు బంధు లేదు, రుణమాఫి లేదు పూర్తిగా అమలు కాలేదని ఒకప్పుడు సక్రమంగా వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదని,ఇది వాయిదాల ప్రభుత్వం తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం కాదని తెలిపారు..ప్రజలు,రైతులు రైతు కూలీల ఇలా అన్ని వర్గాల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ కేటీఆర్ మాత్రమే తెలిపారు..తదనంతరం రజోత్సవ సభ పోస్టర్లను ఆవిష్కరించారు.
