మంత్రి తుమ్మల సెల్ఫ్ గోల్..!

Minister Tummala
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” మేము అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశాము.. దసరా తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాము.. మేము రుణమాఫీ చేయకపోతే రైతులు మమ్మల్ని రోడ్లపై తిరగనిచ్చేవారా…?. మేము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారమహోత్సవ కార్యక్రమాలకు హాజరవుతున్నాము.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులే తరలి వస్తున్నారు. మేము ఎక్కడకెళ్ళిన అక్కడ రైతులు మాకు బ్రహ్మారథం పడుతున్నారు అని అన్నారు. రైతు రుణమాఫీ కాలేదని …. చేయమని సాక్షాత్తు మంత్రి తుమ్మల సొంత జిల్లా ఖమ్మంలో కలెక్టరేట్ దగ్గర తనని రైతులు అడ్డగించిన సంగతి మరిచినట్లున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అయితే రైతులు బ్యాంకుల దగ్గర ధర్నాలకు దిగిన విషయం యాదికి లేనట్లుంది. కామారెడ్డిలో అయితే ఏకంగా రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ .. సొంత నియోజకవర్గం కొడంగల్ లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఊరేగించిన ఊసు కూడా ఆలోచన లేకుండా మాట్లాడిన తుమ్మల రుణమాఫీ ప్రకటనపై సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అని రాజకీయ పండితుల ఉవాచ.
