కేటీఆర్ సంచలన నిర్ణయం

 కేటీఆర్ సంచలన నిర్ణయం

మాజీ మంత్రి కేటీఆర్ మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ “శాసనసభ సమావేశాల తర్వాత ప్రతి రోజూ తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా అందుబాటులో ఉంటాను.సీఎం రేవంత్ రెడ్డి సోదరులు కొండల్ రెడ్డి ,తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. అవసరమైనపుడు అన్ని బయటపెడుతాము.

ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు.. ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు అన్ని బయటకు వస్తాయి.ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోశారు సంతోషం.. అయితే 2 టీఎంసీల నీరు ఎత్తి పోస్తే సరిపోదు.

కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు.నిన్న మేము మేడిగడ్డ వెళ్ళినపుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి.. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకుని నిలబడింది అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *