జనసేనాని ఇది డిజిటల్ యుగం-జరా సోచో…?

 జనసేనాని ఇది డిజిటల్ యుగం-జరా సోచో…?

Pawan Kalyan

Loading

జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరూ అవునన్నా కాదన్నా పొలిటీకల్ పవర్ స్టార్.. మొన్నటిదాక సినిమా పవర్ స్టార్ అయిన ఆయన బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడటానికి .. వైసీపీని పదకొండు స్తానాలకు పరిమితం చేయడానికి ముఖ్య కారణమై ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం గుప్పించిన సూపర్ సిక్స్ హామీలు. తీరా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఒక నెల పాటు పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. అందుకే ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.. కాపర్ డ్యామ్ కృంగిపోయిందని వైసీపీని బద్నాం చేసింది.ఆ తర్వాత కొన్ని రోజులకు టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులు చేశారంటూ కేసులు.. ఆ పార్టీకి చెందిన కార్యకర్తల దగ్గర నుండి నేతల వరకు అందరిపై భౌతికదాడులతో గడిపారు.

ఆ తర్వాత తాజాగా తిరుపతి లడ్డూ ఇష్యూ.. ఈ ఇష్యూతో జనసేనాని ఒక్కసారిగా సనాతన ధర్మపరిరక్షకుడిగా తనకు తాను ప్రకటించేసుకున్నాడు.. ఏకంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఏకంగా దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులందర్నీ ఏకదాటిపై తీసుకోస్తాను.. అందర్ని కలుపుకోని పోతాను అని తిరుపతి వారాహి బహిరంగ సభలో డిక్లరేషన్ ప్రకటించాడు జనసేనాని. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ పవన్ అధికారంలోకి రాకముందు తాను గతంలో చేసిన .. మాట్లాడిన వీడియోలు.. మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఒకనాక సమయంలో తాను బాప్తిస్మన్ తీసుకున్నాను.. మా అమ్మగారు దేవుడి ముందు అగరబత్తీలు వెలిగిస్తే దాంతో సిగరేట్ వెలిగించుకున్నాను.మతం అన్నది మనకు మనం సృష్టించుకున్నదే.. నాకు మతం లేదు.. కులం లేదు.. ప్రాంతం లేదు.. అన్ని ఒకటే అని చెప్పిన వీడియోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. ట్రెండ్ అవుతున్నాయి.

అంటే గతంలో పవన్ అలా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారమెత్తకూడదా అని డౌటానుమానం రావోచ్చు.. మీ అనుమానం కరెక్ట్.. అలా రావడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు సనాతన ధర్మానికి వచ్చిన నష్టం ఏముంది అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పవన్ కంటే ముందే హిందువుల కోసం.. వారి హక్కుల కోసం కోట్లాడే యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ ఉన్నారు.. కరడు గట్టిన హిందువైన నరేందర్ మోదీ ప్రధానిగా ఉన్నారు. అలాంటప్పుడు ప్రస్తుతానికి ఆ సనాతన ధర్మానికి వచ్చిన నష్టం ఏముంది అని వారి వాదన.. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వ హామీలను పక్కకు పోవడానికే ఈ సరికొత్త అవతారం ఎత్తాడని ప్రతిపక్షాల ఆరోపణ. ఏది ఏమైన నిజంగా సనాతన ధర్మానికి కష్జమోస్తే పవన్ ఎంచుకున్న ఏజెండాను ఎవరైన ఆదరిస్తారు..

కాదు కూడదని రాజకీయ స్వలాభం కోసమో.. రాజకీయాల కోసమో ఎత్తుకుంటే మాత్రం అసలే ఇది డిజిటల్ మీడియా యుగం.. ఒక నాయకుడి గతం.. వర్తమానం ఏంటో క్షణాల్లో చేరుతుంది. అందుకే జనసేనాని ఏదైన అంశం ఎత్తుకునే ముందు ఇది డిజిటల్ మీడియా అని గుర్తు పెట్టుకుని వెనక ముందు ఆలోచించి ముందుకు అడుగేస్తే అది ఆయనకు ఆ పార్టీకి.. ఆయనను నమ్ముకున్న కూటమి ప్రభుత్వానికి బలం అవుతుంది.. లేకపోతే ఏమవుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *