ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..!

పహల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భారత్ లోకి పాకిస్తానీయులకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఇక్కడున్న పాకిస్థాన్ ప్రజలు.. అధికారులు నలబై ఎనిమిది గంటల్లో ఇండియాను వదిలివెళ్లాలని హూకుం జారీ చేశారు.
ఇరు దేశాల మధ్య ఉన్న అటారి-వాఘా చెక్పోస్ట్ మూసివేశారు.. అంతేకాకుండా ఇక నుండి పాకిస్థాన్ కు చెందినవాళ్లకు నో వీసా. సింధు జలాల ఒప్పందం నిలిపివేస్తున్నాము.భారత్ నుంచి వెళ్లాలని పాక్ హైకమిషన్కు ఆదేశించారు.
ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మృతి చెందారు. పహల్గామ్ దాడి వెనుక పాక్ హస్తం ఉంది. దీనికి సంబంధించిన మా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి అని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.
