రాజకీయల నుండి తప్పుకుంటా- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.!

బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన ప్రకటన చేశారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థలు నిర్వహించాలి.
స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. గత పదిహేను నెలలుగా ఏ ఒక్క వర్గం ఆనందగా లేరు. ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే బాగుండు అని అనుకుంటున్నారు.
ఎన్నికల్లో అలవీ కానీ హామీలను ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కాంగ్రెస్ పాలన ఏంటో మూడు నెలల్లోనే ప్రజలకు ఆర్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు సానుకూలత లేదు. అందుకే ఉప ఎన్నికలు నిర్వహించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హేద్దేవా చేశారు.
