చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త..!

 చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త..!

CSK vs DC

Loading

చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. ఐపీఎల్ -2025 సీజన్ లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో ఒకే మ్యాచ్ లో గెలుపొంది పాయింట్ల పట్టిక జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది చెన్నై జట్టు. ఈ క్రమంలోనే చెన్నై తలరాతను మార్చే సువర్ణావకాశం మాజీ కెప్టెన్… సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ముందు ఉంది.

ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై కెప్టెన్..ఓపెనర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన సంగతి తెల్సిందే. ఎడమ చేతికి తగిలిన గాయంతో గైక్వాడ్ ఇంకా కోలుకోలేదు. తీవ్ర నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఈరోజు డీసీ జట్టుతో జరగబోయే మ్యాచ్ కు అతడు దూరం కావాల్సి వచ్చింది.

చెన్నై సొంత స్టేడియం చెపాక్ మైదానంలో డీసీ జట్టుతో జరగబోయే మ్యాచ్ కు ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా వ్యవహారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ గా ఐదు కప్ లనందించిన మహేందర్ సింగ్ ధోనీ తన వారసుడుగా యువఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ఈ సీజన్ కు ప్రకటించాడు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *