తొలిసారి పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్న రామ్ గోపాల్ వర్మ…

తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం నేటి ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడు, జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్పట్లో పోస్టు చేశారు..
దీంతో తమ అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించారంటూ నవంబర్ 2024 లో ఆర్జీవీ పై టీడీపీ నేత ఒంగోలు రూరల్ పీఎస్ లో పిర్యాదు చేశారు. దీంతో సిఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని శుక్రవారం విచారించనున్నారు.
గతంలో దర్శకుడూ ఆర్జీవిని అరెస్ట్ చేస్తారంటూ పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. కానీ హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ కి కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చారు.లేటెస్ట్ గా కోర్టు అరెస్ట్ నుండి రిలీఫ్ ఇచ్చినా విచారణకు సహకరించాలని తెలుపడంతో ఆయనకు పోలీసులు నోటిసులు ఇచ్చారు.దీనితో శుక్రవారం ఉదయం విచారణకు వస్తాను అని సమాచారం ఇచ్చిన ఆర్జీవీ.
