సుప్రీం కోర్టు ఎంట్రీతో పెనం పై నుండి పొయ్యిలో పడ్డా రేవంత్ రెడ్డి..!

సింగిడి న్యూస్ -హెచ్ సీయూ,శుక్రవారం 04
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఎంట్రీతో వేలం వేద్దామనుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై ఆశలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది.
అధికారం మనదే.. వ్యవస్థలు మనవే అనుకుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సీయూ పరిధిలోని నాలుగోందల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీకి బదిలీ చేయించింది. అక్కడితో ఆగకుండా ఆ భూములను చూపించి రూ పదివేల కోట్లను అప్పుగా తీసుకున్నట్లు సచివాలయంలో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ భూములను తనఖా పెట్టి నలబై వేల కోట్ల రూపా యలను ఆదాయంగా వస్తుందని భావించిన రేవంత్ రెడ్డి సర్కారుకి సుప్రీం ఆదేశాలతో బ్రేకులు వేసినట్లు అయింది. దీంతో ఇప్పట్లో ఈ వివాదం పరిష్కారమయ్యే పరిస్థితులు కన్పించడంలేదు.. ఇప్పటికే తీసుకున్న పదివేల కోట్లకు నెలకు వడ్డీలు కట్టాలి..
ఇవి కాకుండా ఇప్పటివరకూ తీసుకున్న లక్షా యాబై వేల కోట్ల రూపాయలకు వడ్డీలు కట్టాలి..సుప్రీం కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సర్కారు పరిస్థితి పెనంపై నుండి పోయ్యిలో పడినట్లుగా అయింది.. దీంతో ఏమి చేయాలో తెలియక నిన్నటి నుండి రేవంత్ రెడ్డి తల పట్టుకుంటున్నారని గుసగుసలు.
