ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy struggles for one day headline..!
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4.30గంలకు ఢిల్లీకు బయలు దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు అని తెలుస్తుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ, పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ను తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాల సమాచారం.. ఈ భేటీలో తెలంగాణలో జరిగిన వరద నష్టం పై ప్రధానితో సహా కేంద్ర మంత్రులకు నివేదించనున్నారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్ ,కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఖమ్మం ,మహబూబాబాద్ జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టంపై నివేదిక ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ,రాహుల్ గాంధీలను కలవనున్నట్లు తెలుస్తుంది.
