పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్పై మదురైలో కేసు నమోదు అయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెల్సిందే.
ఇందుకుగాను మదురైలోని కమిషనరేట్లో వాంజినాధన్ అనే న్యాయవాది కంప్లయింట్ ఇచ్చాడు. సనతాన ధర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించి మాట్లాడాడని ఆ ఫిర్యాదులో తెలిపాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. పవన్ కళ్యాణ్ స్టాలిన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పరోక్షంగా స్టాలిన్కు వార్నింగ్ ఇచ్చారు.
పవన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకు పోతారని పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ సభలో ప్రకటించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై అటు తమిళనాడు డీఎంకే నేతలకు ఇటు జనసేన నేతలకు సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది.
