రేవంత్ రెడ్డికి షాకిచ్చిన భట్టీ విక్రమార్క..!

 రేవంత్ రెడ్డికి షాకిచ్చిన భట్టీ విక్రమార్క..!

Loading

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇటీవల రాష్ట్రాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని ఆకర్శించిన హెచ్ సీయూ వివాదానికి కారణమైన యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు.. ఆ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు.. సోషల్ మీడియా వారీయర్స్.. ప్రజా సంఘాలు.. అఖరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా అందరూ ఆ వివాదానికి సంబంధించి AI కంటెంటు తో వైరల్ చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూరేలా అసత్య ప్రచారం చేశారనే నెపంతో అందరిపై కేసులు నమోదు చేశారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.

ఈరోజు సోమవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సబ్ కమిటీ లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ, యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ కమిటీ, ప్రజా సంఘాలు పాల్గోన్నారు. ఈ సమావేశంలో దాదాపు గంటపాటు జరిగిన చర్చలో పలు అంశాల గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలో టీచర్స్ కమిటీ, పీపుల్స్ అసోసియేషన్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీకి విద్యార్థులపై .. ఈ సమస్యను ప్రపంచానికి తెలియజేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టారు.

జైళ్లకు తరలించారు అని నివేదించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు స్పందిస్తూ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరణ చేసుకోవాలి . భేషరత్ అరెస్ట్ చేసిన వాళ్లను ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విద్యార్థులు.. ప్రజాసంఘాలు.. నెటిజన్లు హార్షం వ్యక్తం చేస్తున్నారు. అనాలోచితంగా ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భట్టీ తనదైన శైలీలో బుద్ధి చెప్పారు. గట్టి షాకిచ్చారు. ఇప్పటికైన ప్రజావ్యతిరేక కార్యక్రమాలు కాకుండా ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలి. హెచ్ సీయూ వివాదంపై కూడా సానుకూలంగా స్పందించాలని నెటిజన్లు ట్విట్టర్ లో మ్రారుమోగిస్తున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *