Andhra Pradesh Slider

కేశినేని నాని సంచలనం నిర్ణయం

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీ లో చేరిన మాజీ ఎంపీ… సీనియర్ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుండి రెండు సార్లు ఎంపీ గా గెలుపొందిన కేశినేని నాని ప్రత్యేక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తను రాజకీయాల నుండి తప్పుకున్న కానీ విజయవాడ ప్రజలందరికి అందుబాటులో ఉంటాను అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి తన తమ్ముడు టీడీపీ ఎంపీ […]Read More

Andhra Pradesh National Slider

ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.Read More

Andhra Pradesh Slider

మాజీ మంత్రి బొత్స పై పిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More

National Slider Videos

మోదీ తొలి సంతకం దీనిపైనే..?

భారతప్రధానమంత్రిగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. ఇందులో భాగంగా 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి రూ.20,000 కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని  మోదీ ఈసందర్భంగా తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని ఆయన వివరించారు.Read More

Slider Telangana

నల్గోండ డీసీసీబీ చైర్మన్ కు అసమ్మతి సెగ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్  గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More

Slider Telangana

కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసానికి మాజీ మంత్రి హారీష్ రావు పరామర్శ

తెలంగాణ రాష్ట్రమాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరులు తలసాని శంకర్ యాదవ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మరణించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వారి భౌతిక కాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బోయిన్ పల్లి మార్కెట్ అధ్యక్షుడిగా శంకర్ యాదవ్ గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.Read More

Slider Telangana

మాజీ మంత్రి తలసాని ఇంట విషాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు..సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం నెలకొన్నది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు, తలసాని శంకర్ యాదవ్  మృతి చెందారు.Read More

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి రామ్మోహాన్ నాయుడు ఏమోషనల్ వీడియో

ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం  టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More

Slider Sports

T20వరల్డ్ కప్ లో టీమిండియా చరిత్ర

న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టుపై    గెలిచిన భారత్ వరల్డ్ కప్ టోర్నిలో  ఒకే జట్టు(పాక్)పై అత్యధికసార్లు(7) గెలిచిన జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్పై పాక్, విండీస్ జట్లపై  శ్రీలంక చెరో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉన్నాయి. కాగా వన్డే వరల్డ్ కప్ […]Read More