ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని రాష్ట్రంలోని ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అన్ వ్యక్తి పలువురితో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టాడు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164స్థానాలు.. వైసీపీ పదకొండు స్థానాల్లోనే మాత్రమే గెలుపొందింది. దీంతో వైసీపీ ఓడిపోవడంతో వేణు గోపాల్ రెడ్డి తన ఊరు.. ఇల్లు విడిచి వెళ్లిపోయాడు.. అతనికి ఎంతగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు […]Read More
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లలో రిషభ్ పంత్(42) మినహా ఒక్కరంటే ఒక్కరు దాయదీ జటు బౌలర్లను దీటుగా ఎదుర్కొని నిలబడలేకపోయారు. బ్యాటింగ్ యూనిట్ వైఫల్యంతో టీమిండియా 119 పరుగులకే ఆలౌటయ్యింది. న్యూయార్క్ పిచ్పై పాక్ బౌలర్లు నసీం షా(3/21), హ్యారిస్ రవుఫ్(3/21)లు రెచ్చిపోయారు. 120పరుగు లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ జట్టు ఆరు ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పొయి […]Read More
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఏపీలోని నరసాపురం పార్లమెంట్ నుండి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూపతిరాజు శ్రీనివాస వర్మతో ప్రమాణం చేయించారు. మరోవైపు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచి మంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.Read More
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “కేంద్రమంత్రి వర్గ కూర్పులో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశారు.. రాబోవు వందరోజుల ప్రణాళికల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆలోచిస్తున్నారు. వచ్చే ఐదేండ్లలో పేదలకు మూడు కోట్ల ఇండ్లను నిర్మించి తీరుతాము. తెలంగాణలో సంస్థాగత మార్పులుంటాయి..బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పులుంటాయి..నన్ను కేంద్రమంత్రిగా నియమించిన ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ధన్యవాదాలు” అని అన్నారు.Read More
టీ20 వరల్డ్ కప్ లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా 119పరుగులకు అలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా ఆటగాళ్లు నిలబడలేకపోయారు..టీమిండియా జట్టులో పంత్42,అక్షర 20,రోహిత్ 13పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా,రవూఫ్ మూడేసి వికెట్లను తీశారు..ఆమీర్ 2, అప్రిది 1 వికెట్లను తీశారు.పాకిస్థాన్ 20ఓవర్లలో 120పరుగులను సాధించాలి.Read More
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో 11ఎమ్మెల్యే..4ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణం అని ఆ పార్టీ నేత .మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వాపోయారు. ఆ చట్టంపై టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారని చెప్పారు. ‘ఎన్నికల ప్రచార సమయంలోనే ఈ చట్టంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని […]Read More
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా రెండో సారి గెలుపొందిన గంగాపురం కిషన్ రెడ్డి మోదీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.Read More
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ శుభాకాంక్షలు
తెలంగాణ నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు గంగపురం కిషన్ రెడ్డి గారు (సికింద్రాబాద్, MP) కేంద్ర మంత్రి, మరియు బండి సంజయ్ కుమార్ గారు (కరీంనగర్,MP) కేంద్ర సహాయమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా […]Read More
భారత ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు..ప్రధానమంత్రి నరేందర్ మోదీతో పాటు 72మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 30మందికి కేబినెట్ హోదా.. 5గురుకి సహాయక కేంద్ర మంత్రులు(స్వతంత్ర హోదా)..36మందికి సహాయక మంత్రులు ఉన్నారు. వీరిలో 43మందికి మూడు సార్లు మంత్రులుగా పని చేసిన అనుభవం ఉంది.ఇరవై ఆరు మందికి ఆయా రాష్ట్రాల మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.Read More
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు..మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈరోజు కొలువుదీరుతున్న మోదీ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన జి కిషన్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన బండి సంజయ్ లకు కేంద్ర మంత్రులుగా ఆ పార్టీ జాతీయ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలంగాణ […]Read More