ప్రశ్నించాడని బీఆర్ఎస్ కార్యకర్తపై దాష్టికం..!

Attack on BRS activist
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టెకి చెందిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కేసీఆర్ గాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉ. పోయించాను.
అని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రామయంపేటకు చెందిన నర్సింగ్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ ను స్థానిక పీఎస్ కు పిలిపించుకోని తమ ప్రతాపం చూపించారు పోలీస్ అధికారులు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకే బీఆర్ఎస్ కార్యకర్తపై అక్రమ కేసులు పెట్టి ఈ దాష్టికానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
