నిజామాబాద్ ఎమ్మెల్సీ వర్క్‌షాప్ లో‌ పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా గీతా రెడ్డి…

 నిజామాబాద్ ఎమ్మెల్సీ వర్క్‌షాప్ లో‌ పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా గీతా రెడ్డి…

తెలంగాణాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇందూరులో కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వర్క్ షాప్ కార్యక్రమం నిర్వహించారు.

నియోజకవర్గంలోని పట్టభద్రులను సంప్రదించు వివిధ సాధనాల గురించి, వారికి బిజెపి కలిగిస్తున్న భరోసాను గురించి వివరించి, ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో, బిజెపి బలపరచిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ సి.అంజిరెడ్డి గారిని గెలిపించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు, నిజామాబాద్ బిజెపి ఎమ్మెల్యే శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్త గారు, కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రా రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు, బిజెపి అధికార ప్రతినిధి శ్రీ ఎన్.వీ.సుభాష్ గారు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *