తెలంగాణలో కొత్తగా 4 పథకాలు..!

 తెలంగాణలో కొత్తగా 4 పథకాలు..!

Loading

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుండి జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి కొత్తగా నాలుగు పథకాలను అమలు చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో స్థానిక మంత్రులు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్లను.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను రేపటి నుండి అమలు కానున్నాయి.

దీనికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నట్లు తెలుస్తుంది. రాజధాని మహానగరం హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోని ఓ గ్రామంలో అమలు చేయనున్నారు. రేపటి నుండి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఈ పథకాలన్నీ అమలు జరగనున్నాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *